నిత్యవసర సరుకులు పంపిణీ

553చూసినవారు
నిత్యవసర సరుకులు పంపిణీ
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం తుమ్మలచెరువులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల గుడిసె కాలిపోయిన జీవరత్నం కుటుంబ సభ్యులకు "మన ఆపద్బాంధవులు" ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల సరుకులు అందజేశారు. ఫౌండేషన్ సభ్యులు బుధవారం గ్రామానికి చేరుకుని జీవరత్నం స్థితిగతులు పరిశీలించి సరుకులు అందించారు. ఆపదలో ఉన్నవారికి తమవంతు సహాయం అందిస్తామని ఫౌండేషన్ సభ్యులు హరికృష్ణ, మహేష్, శ్రీకాంత్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్