అబద్ధాలతో కేసీఆర్ దుష్ప్రచారం: రేవంత్

75చూసినవారు
అబద్ధాలతో కేసీఆర్ దుష్ప్రచారం: రేవంత్
రాష్ట్రంలో కరెంట్ కోతలంటూ పాలమూరులో శనివారం కేసీఆర్ చేసిన మాటలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 'లేనిపోని అబద్ధాలతో కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. మొన్న సూర్యాపేటలో కరెంట్ పోయిందని అబద్ధం చెప్పారు. మహబూబ్ నగర్ లోనూ ఇప్పుడు అవే అబద్ధాలు చెప్పారు. కేసీఆర్ కు మరీ ఇంత అధికార దాహం ఎందుకు? ఓడిన తర్వాత కూడా ఆయనకు ఇంకా గర్వం తగ్గలేదు. రిజర్వేషన్లపై బిఆర్ఎస్ వైఖరి ఏంటో కేసీఆర్ ప్రకటించాలని' సీఎం డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్