మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, శ్రీకాంత్ చారి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివి అన్నారు.