ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. మండల పరిధిలోని గోటూరు శివారులో ఇసుక తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నట్లు చెప్పారు. ఇసుక తరలిస్తున్న యజమానులు, ట్రాక్టర్ డ్రైవర్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.