ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

78చూసినవారు
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా సోమవారం బెల్లంపల్లి శాఖ గ్రంధాలయాన్ని సందర్శించారు. పురుషులు, మహిళల రీడింగ్ రూములను వారు పరిశీలించారు. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లెక్చరర్లు ఝాన్సీ, రజిత, తిరుపతి ల ఆధ్వర్యంలో విద్యార్థులు గ్రంథాలయంలోని పలు విషయాలను గ్రంథాలయ అధికారి ఉప్పు గోపిని అడిగి తెలుసుకున్నారు. పేపర్ రీడింగ్, బుక్ రీడింగ్ సెక్షన్స్ సైతం పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్