ఐదుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

555చూసినవారు
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెతులపూర్ గ్రామ సమీప ప్రాంతంలో పేకాట స్థావరంపై మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న కనుకుంట్ల నర్సయ్య, సముద్రాల రమేష్, గంగారపు రామకృష్ణ, గుంజపడుగు సంపత్, మామిడాల శంకర్ ను అరెస్ట్ చేయగా, లోకిని ప్రశాంత్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ. 18, 490 నగదు, 5 మొబైల్స్, 4 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్