ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి

82చూసినవారు
ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి
చెన్నూర్ మండలం అక్కెపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న గూడ కవిత కుటుంబ సభ్యులను బుధవారం ఐద్వా సభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు బోగే నాగజ్యోతి, జిల్లా కార్యదర్శి సామల ఉమారాణి మాట్లాడుతూ కట్నం కోసం భర్త, అత్త వేధింపులతోనే కవిత ఆత్మహత్య చేసుకుందని, దోషులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్