రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

80చూసినవారు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన రంజాన్ పర్వదినం వేడుకల్లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. పట్టణంలోని ఈద్గాలను సందర్శించి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్