గ్రామ పంచాయతీ కార్మికుల నిరసన

64చూసినవారు
గ్రామ పంచాయతీ కార్మికుల నిరసన
గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో దేవరకొండ ఎంపీడీవో కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య మాట్లాడుతూ కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే వేతనాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, అంజయ్య, పుష్పమ్మ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్