ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ రూపొందించిన సిలబస్ కాకుండా, తమ ఇష్టానుసారంగా సిలబస్ అమలుపరిచి విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఏబీవీపీ రాష్ట్ర నేత గోపీచంద్ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలలలో అర్హతలేని టీచర్స్ చే బోధన చేయిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు.