నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలి

77చూసినవారు
నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలి
రైతులకు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని ఉట్నూర్ మండల వ్యవసాయ అధికారి గణేష్ సూచించారు. శుక్రవారం సాయంత్రం ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ గ్రామంలో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ నిర్దేశించిన విత్తనాలను మాత్రమే రైతులకు అమ్మాలని ఆయన సూచించారు. అలాగే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను అమ్మేటప్పుడు రైతులకు తప్పకుండా బిల్లులను ఇవ్వాలనీ ఏఓ సూచించారు.

సంబంధిత పోస్ట్