ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి

63చూసినవారు
కేంద్రంలో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వ సహకారంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. గురువారం జన్నారం మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఆయన 'లోకల్ ప్రతినిధి'తో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేయడమే తమ లక్ష్యమన్నారు. నగేష్ రాజకీయ అనుభవం కలిగిన మంచి వ్యక్తి అని తెలిపారు. నగేష్ ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

సంబంధిత పోస్ట్