సంతానం లేక మానసికంగా బాధపడుతూ మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కిషన్ గల్లీకి చెందిన మహేష్ (35)కు సంతానం లేక మానసికంగా బాధపడుతు ఉండేవాడిని ఈ క్రమంలో మద్యానికి బానిసై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.