ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి గాయాలు
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలైన ఘటన కుబీర్ మండలం చాత గ్రామంలో చోటుచేసుకుంది. డోడర్నతండాకు చెందిన జాదవ్ బాబులాల్ మంగళవారం నర్సాపూర్ మండలం బుర్గు పెల్లి (జి) లో బంధువుల ఇంట్లో శుభకార్యానికి బైక్ పై వెళ్లాడు. సాయంత్రం డోడర్నకు తిరిగి వస్తుండగా ఆర్డీసీ బస్ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని భైంసా ఆసుపత్రికి తరలించారు.