నందిపేట పట్టణంలోని శైవక్షేత్రాలు అయినటువంటి శ్రీ కేదారేశ్వర ఆశ్రమం, నందికేశ్వర ఆలయం, నవరత్నాల గుడి, సాంబయ్య గుడి బ్రహ్మంగారి గుడిల దగ్గర శివరాత్రి పురస్కరించుకొని గురువారం ఆలయ కమిటీ వారు అన్న సత్రాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.