దడువాయి యూనియన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

79చూసినవారు
దడువాయి యూనియన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
నిజామాబాద్ దడువాయి యూనియన్ నూతన పాలకవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ (శ్రద్ధానంద్ గంజ్)లో దడువాయి యూనియన్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గం చేత ఐఎన్టియుసి జిల్లా నాయకులు మల్యాల గోవర్ధన్ ప్రమాణం చేయించారు. సలహాదారులుగా మల్యాల గోవర్ధన్, అధ్యక్షులుగా అశోక్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులుగా ఆర్ రవీందర్ గౌడ్, ప్రవీణ్ కోశాధికారిగా ఎస్ ఉమేష్, కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణం చేయించారు.

సంబంధిత పోస్ట్