బీడీ కార్మికులకు పెరిగిన వేతనం అమలు చేయాలి: ఏఐటీయూసీ

57చూసినవారు
బీడీ కార్మికులకు పెరిగిన వేతనం అమలు చేయాలి: ఏఐటీయూసీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వై. ఓమయ్య మాట్లాడుతూ.. పోరాడి వేతనాలు పెంచుకున్న కార్మికులకు పెంచిన వేతనం మే ఒకటవ తేదీ నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సజ్జన భాను చందర్, నాయకులు మారంపల్లి మల్లుబాయ్, రవీందర్, సాయికిరణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్