భారీ భూకంపం కారణంగా మయన్మార్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికే మృతుల సంఖ్య వెయ్యి దాటినట్లు మయన్మార్ ప్రభుత్వం వెల్లడించింది. గాయపడిన వారి సంఖ్య 2వేలకు పైగా ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఇప్పటివరకు మరణించిన వారిలో భారతీయులు ఎవరూ లేరని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. భూకంప బాధిత దేశానికి మానవతా సాయంలో భాగంగా అత్యవసర సామగ్రి, సహాయక సిబ్బందిని పంపిస్తున్నట్లు తెలిపింది.