నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు

64చూసినవారు
నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను సమర్పించేందుకు పార్లమెంటు సోమవారం నుంచి సమావేశం కాబోతోంది. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. మంగళవారం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కేంద్రం ఆరు బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, రైల్వే భద్రత వంటి అంశాలపై కేంద్రాన్ని ఐక్యంగా నిలదీయాలని విపక్షం భావిస్తోంది.

సంబంధిత పోస్ట్