ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై నటుడు ప్రకాశ్రాజ్ మరోసారి సెటైర్లు వేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పవన్ పై విమర్శలు చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ప్రజలు తనకు అధికారం ఇస్తే ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. అలాగే త్రిభాషా విధానం, తిరుమల ప్రసాదం లడ్డూ విషయంలో గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా కౌంటర్ వేశారు.