కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మరోసారి ట్విట్టర్(ఎక్స్) వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ పాలనలో సాగు, తాగునీరు, కరెంట్ సమస్యలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి మీనామేషాలు లెక్కిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు తప్పడం లేదని ధ్వజమెత్తారు.