రైతు భరోసా నిధులు విడుదల: సీఎం రేవంత్
తెలంగాణలో రైతు భరోసా పథకం కింద రూ. 2వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 5 ఎకరాలు పైబడిన రైతుల ఖాతాల్లో వాటిని జమ చేసింది. కాగా ఈనెల 9లోగా రైతు భరోసా నిధులను పూర్తిగా జమ చేస్తామని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. వీటితో పాటు పంట నష్ట పరిహారం కింద ఎకరానికి రూ. 10వేల నిధులను కూడా ఈసీ అనుమతితో సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది.