ఆధ్యాత్మిక చింతనతోనే సమాజంలో శాంతి సామరస్యం నెలకొంటాయని సదర్ ఖాజి సయ్యద్ ముక్తదిర్ అలీ అన్నారు. గురువారం షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ ఈద్గా వద్ద జరిగిన రంజాన్ ఈదుల్ ఫితర్ ప్రార్ధనలను పురస్కరించుకొని ఆయన సందేశం ఇచ్చారు. వేలాదిమంది ముస్లిం సోదరులు ప్రార్థనలకు హాజరయ్యారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.