సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచారు. శనివారం పారిశ్రామిక వాడలోని ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని సుజనా స్టీల్ పరిశ్రమను మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్వో శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది సీజ్ చేశారు. పన్ను చెల్లించని పరిశ్రమలకు నోటీసులు జారీ చేసి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.