ప్రాథమికోన్నత పాఠశాలలో వార్షికోత్సవం

52చూసినవారు
ప్రాథమికోన్నత పాఠశాలలో వార్షికోత్సవం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం సాయంత్రం వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్