సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన ద్వారం ముందు అగ్ని గుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అగ్నిగుండాల మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.