జాతీయ పక్షుల సందడి

52చూసినవారు
సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిన్నారం గుమ్మడిదల మండలాల్లోని అటవీ ప్రాంతంలో లెక్కలేనన్ని నెమళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం జిన్నారం మండలం కొడకంచి, లక్ష్మీపతి గూడెం బ్రిడ్జ్ శివారులోని పంట పొలాలు, అటవీ ప్రాంతంలో జాతీయ పక్షులు సందడి చేశాయి. రోడ్లపైకి జనావాసాల మధ్యకు వచ్చి చూపరులను జాతీయ పక్షులు ఆకట్టుకుంటున్నాయి. నెమళ్ల గుంపును చూసిన పలువురు తమ సెల్ ఫోన్లలో చిత్రాలను బంధించి సంబరపడ్డారు.

సంబంధిత పోస్ట్