రైతుల సమస్యలపై ఉద్యమాలు చేద్దాం

56చూసినవారు
రైతుల సమస్యలపై ఉద్యమాలు చేద్దాం
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించాలని అఖిల భారత కిసాన్ సభ రాష్ట్ర కమిటీ సభ్యులు నర్సింహారెడ్డి అన్నారు. కిసాన్ మహాసభ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో సంఘ జెండాను గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి బిజెపి అధికారంలోకి వస్తే మళ్లీ నల్ల చట్టాలను తీసుకువస్తుందని ఆరోపించారు. బిజెపిని ఓడించేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్