హైదరాబాద్‌లో కొనసాగుతున్న శ్రీరాముడి శోభాయాత్ర

81చూసినవారు
హైదరాబాద్‌లో కొనసాగుతున్న శ్రీరాముడి శోభాయాత్ర
హైదరాబాద్‌లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వేలాదిమంది భక్త జన సందోహం మధ్య ర్యాలీ ముందుకు కదులుతోంది. నగరంలోని మంగళ్‌హాట్ ప్రాంతంలోని సీతారాం భాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం ధూల్ పేటకు చేరుకుంది. పలు హిందూ సంఘాలు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. మొత్తం 6.3 కి.మీ మేర ఈ శోభాయాత్ర సాగుతుంది.

సంబంధిత పోస్ట్