ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికా సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు నేడు తలపడనున్నాయి. రాత్రి 7:00 గంటలకు టాస్ పడనుంది. అనంతరం రాత్రి 7:30 నిమిషాలకు మ్యాచ్ మొదలుకానుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు హైదరాబాద్, గుజరాత్ జట్లు మొత్తం ఐదు సార్లు తలపడ్డాయి. అయితే అందులో 3 నెగ్గిన గుజరాత్ టైటాన్స్దే పైచేయిగా ఉంది. సన్ రైజర్స్ కేవలం ఒక్క మ్యాచ్లోనే గెలుపొందింది. ఇంకొక మ్యాచ్ రద్దయింది.