సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా ఉంచిన పథకం ఇది. ప్రస్తుత వడ్డీ రేటు 8.2% కాగా, గరిష్ట పెట్టుబడి పరిమితిని ఇప్పుడు రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచారు. 55 ఏళ్ల పైబడిన వ్యక్తులు ఈ స్కీమ్లో రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టితే, 5 సంవత్సరాలలో మొత్తం రూ. 2,46,000 వడ్డీ పొందవచ్చు. ఈ మొత్తం ప్రతి నెలా రూ. 20,500 రాబడిగా వస్తుంది. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని పోస్టాఫీసును సంప్రదించండి.