బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు రావు

59చూసినవారు
బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు రావు
నెరేడ్చర్ల పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు అవుతాయని, తెలంగాణలో ఒక్క స్థానంలో కూడ ఆ పార్టీ గెలవదని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నేరేడుచర్లలో ఉత్తమ్ మాట్లాడుతూ.. 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. పార్లమెంటు ఎన్నికల తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి ఉండదని చెప్పారు.

సంబంధిత పోస్ట్