హుజూర్నగర్ ఎమ్మెల్యే, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ముస్లింలకు రంజాన్ పండగ శుభాకాంక్షలు గురువారం తెలిపారు. మత సమరస్యానికి ప్రతీక రంజాన్ పండగని వివరించారు. క్రమశిక్షణతో ఉండటం ఐక్య మత్యంతో వెలగడం పేదలకు తోడ్పాటు అందించడం రంజాన్ పండగ మానవాళికి ఇచ్చే సందేశనని వివరించారు. రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.