వృద్ధాప్యం, మతిస్తిమితం సరిగా లేని వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన పాలకీడులోని జాన్పహాడ్ దర్గా గ్రామ పరిధిలో చోటుచేసుకొంది. జాన్పహాడ్ గ్రామానికి చెందిన సాధినేని రోశయ్య(93) తన వ్యవసాయ క్షేత్రంలోని విద్యుత్తు నియంత్రికను పట్టుకోగా అక్కడికక్కడే చనిపోయారు. అతడి కుమారుడు జగ్గయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మీనర్సయ్య గురువారం తెలిపారు.