నేను ఏఎస్ఐని మాట్లాడుతున్నని రూ. 75 వేల మోసం
నేను ఏఎస్ఐని మాట్లాడుతున్నాని ఫోన్ చేసి రూ. 75000 మోసానికి పాల్పడిన ఘటన నేరేడుచర్లలో వెలుగు చూసింది. ఓ పెట్రోల్ బంక్ యజమాని రామకోటేశ్వరావుకి అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి ఎస్సై కుమార్తెకు యాక్సిడెంట్ జరిగిందని, 75వేలు మీకు నగదు పంపిస్తాను ఫోన్ పే చేయాలని తెలిపాడు. ఆగంతకుడు పంపిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపారు. తిరిగి నగదు రాకపోవడంతో శనివారం 1930కు ఫిర్యాదు చేసి ఎస్సై రవీందర్ కు విషయాన్ని తెలిపారు.