తుంగతుర్తి నియోజక వర్గ ప్రజలకు సాగు నీరు అందించే ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీటి విడుదలను నిలిపివేసినట్లు జలవనరుల శాఖ డిఈ సత్యనారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18న నీటిని అధికారులు విడుదల చేసారని, ప్రస్తుతం కాల్వలకు మరమత్తులు చేపడుతుండం, సాగు నీరు అవసరం లేకపోవడంతో నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 10 తరువాత నీటిని విడుదల చేస్తామని అన్నారు.