రేపటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

55చూసినవారు
రేపటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 3 నుంచి 13 వరకు జరగనున్న ఈ పరీక్షలకు 51,237 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం 170 పరీక్షా కేంద్రాలు, 38 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ బృందాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్