శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం పరిగి మండల పరిధిలోని పెద్ద మాదారం గ్రామంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దైవచింతలతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.