ఇసుకను తరలిస్తుండగా అడ్డుకున్న రైతులు

79చూసినవారు
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సింగారం గ్రామంలో అనుమతులు లేకుండా గోదావరిలోని రైతుల పట్టా భూముల్లో ఇసుకను తరలించేందుకు ప్రయత్నించిన వ్యక్తులను శుక్రవారం రైతులు అడ్డుకున్నారు. దీంతో వారికి, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు సదరు వ్యక్తులు చేపట్టిన ఇసుక తరలింపు పనులను నిలిపివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్