ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లాలో బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ. భూమి ఆకాశం తిరగబడ్డ భూమి బద్దలైన ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. హరీష్ రావు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని హితవు పలికారు.