ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

541చూసినవారు
జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫతేపూర్ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఫాతేపూర్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై కూలి పని నిమిత్తం వెళ్తుండగా అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది. ఘటనలో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ క్షత్రగాతులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్