జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫాతేషాపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు ఎండి విజన్సీ(82) ఆత్మహత్యకు కారణమైన నాపియా బేగం, ఆమె కుమారుడు జమిల్ పాషాను పోలిసులు శనివారం అరెస్టు చేశారు. విజన్సీ కోడలు నఫియా బేగం ఆమె కుమారుడు జమిల్ పాషా ఆ ఇద్దరు వృద్ధురాలిని దూషించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు కారణమైన ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.