టీమిండియా తమ తొలి మ్యాచ్ ఈ నెల 20న దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్తో తలపడనుంది. 23న అదే స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాక్తో తలపడనుంది. భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్తో ఆడనుంది. కాగా గ్రూపు-ఎలో భారత్తో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. గ్రూపు-బిలో ఆఫ్ఘన్, ఆసీస్; ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. మార్చి 4న మొదటి సెమీ ఫైనల్, మార్చి 9న ఫైనల్స్ నిర్వహిస్తున్నారు.