ఢిల్లీ సీఎం, AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను జూన్ 5 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు పంపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో కేజ్రీవాల్ ఆదివారం లొంగిపోయారు. ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ కోరుతూ ED ఇటీవల దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై ఉన్నందున ED దాఖలు చేసిన పిటిషన్ ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది.