తాడిపత్రి అల్లర్లలో ద్వితీయ శ్రేణి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 91 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. ఇందులో టీడీపీకి చెందిన 50 మంది.. వైసీపీకి చెందిన 41 మందిని గుర్తించి నిన్న ఉరవకొండ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. వారిని కడప జైలుకు తరలించారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. కొత్త ఎస్పీ వచ్చిన వెంటనే తాడపత్రి అల్లర్లపై మరిన్ని అరెస్ట్లు ఉండే అవకాశం ఉంది.