సంక్షేమ పథకాల్లో ఏపీ రోల్ మోడల్గా నిలిచిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. "ధర్మవరం సభలో మా ప్రభుత్వంపై అమిత్ షా అవినీతి ఆరోపణలు చేశారు. చంద్రబాబు చెప్పిందే ఆయన మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఏపీలో అవినీతి జరిగింది. వారి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి." అని సజ్జల పేర్కొన్నారు.