ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ 2024) కొత్త నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. జులై 1న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. నోటిఫికేషన్, షెడ్యూల్, సిలబస్తో పాటు ఆన్లైన్లో జరిగే ఈ పరీక్షపై అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలను విద్యాశాఖ అధికారులు ఖరారు చేశారు. ఈ సమాచారాన్ని జులై 2 నుంచి https://cse.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.