గుడిపాల మండలంలో కొబ్బరి తోటలకు తెగుళ్లు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేసవికాలం వచ్చిందంటే కొబ్బరికి భలే డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో కొబ్బరికాయలకు మంచిగిరాకీ ఉంది. తెగుళ్లు సోకడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. వరి, మామిడి, చెరకు రైతులతో పాటు కొబ్బరిసాగు రైతులు కూడా నల్లతెగుళ్లతో ఆందోళన చెందుతున్నారు. కష్టపడి సాగుచేసిన పంటలవల్ల అప్పులు మిగులుతున్నాయని రైతులు వాపోతున్నారు.