వైభవంగా మాతమ్మ జాతర

కార్వేటినగరం మండలంలోని కొల్లాగుంట పంచాయతీ ఆది అరుంధతి వాడలో వెలసిన మాతమ్మ జాతరను గ్రామస్థులు సోమవారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకాలు చేశారు. మహిళలంతా కలసి సామూహికంగా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి దీలుబోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఎమ్మెల్యే థామస్ సోదరుడు నిధి, జనార్దన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్