చెరువును తలపిస్తున్న బస్టాండ్

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ లో మంగళవారం కురిసిన వర్షానికి వర్షపునీరు చేరడంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఇలాగే ఉన్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు తెలిపారు. నేటి సాయంత్రం ఆ గుంతలు సరిగా కనిపించక ఓ ద్విచక్ర వాహనదారుడు నీటి గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డాడు.

సంబంధిత పోస్ట్